నటి యమున చాలామందికి తెలుసు ఆమె సినిమాలు చేసేది. ఆమె ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. అప్పట్లో టాప్ హీరోయిన్ గా మంచి పేరుని కూడా ఈమె తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసి సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది యమున. ఎప్పుడు కూడా ఈమె ప్రేక్షకుల్ని అందంతో అభినయంతో కట్టిపడేసేది అయితే అందరి జీవితంలో కూడా కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదు. అలనే ఈమె కి కూడా తప్పలేదు.
బెంగళూరులోని వ్యభిచారం చేస్తూ 2011లో ఈమె పోలీసులకి పట్టుబడింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈమె మాత్రం తన తప్పేమీ లేదని కావాలని ఆమెని ఇరికించాలని అంది. తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చి ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నా తప్పేమీ లేదు అయినా కూడా నేను తప్పు చేశానని అంత అంటున్నారని… అది నిజం కాదని ఈమె చెప్పారు ఒక వీడియోలో తన బాధని పంచుకున్నారు.
నేను నన్ను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా ఏదో తెలియని బాధ నాలో ఉండిపోయింది అని అన్నారు. సోషల్ మీడియా వలనే ఇలా అవుతోందని ఈ సమస్య నుండి బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఉన్నాను కానీ సోషల్ మీడియాలో థంబ్ నైల్స్ ని చూస్తుంటే బాధ వస్తోంది అని చెప్పింది. విదేవులని నేను ఎప్పుడు ఓపెన్ చేసి చూడను కానీ థంబ్ నైల్స్ ని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అని ఆమె ఎమోషనల్ అయ్యారు.
న్యాయస్థానం కూడా క్లీన్ చిట్ ఇచ్చేసి నన్ను గెలిపించింది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇంకా ఇవన్నీ వినపడుతున్నాయని సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నాను అని బాధపడింది యమున. ఏదో తెలియని నొప్పి కలుగుతుందని చాలా మంది సోషల్ మీడియాలో నా గురించి తప్పుగా రాసి డబ్బులు సంపాదించుకుంటున్నారని యమున చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజం కాదు అర్థం చేసుకోండి అంటూ తన బాధను పంచుకుంది.