మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమా కూడా మీకు గుర్తుండే ఉంటుంది రచ్చ సినిమాలో చూసుకోన్నట్లయితే చైల్డ్ ఆర్టిస్టులు అదరగొట్టేసారు చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు స్టార్ హీరో హీరోయిన్లు సినిమాల్లో కనబడుతూ ఉంటారు చిన్ననాటి పాత్రలు చేస్తూ పాపులర్ అయిపోతుంటారు. గంగోత్రి సినిమాలో చూసుకున్నట్లయితే కావ్య కళ్యాణ్ రామ్ చిన్న పిల్లగా నటించి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది.
చైల్డ్ ఆర్టిస్ట్లకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటే భవిష్యత్తులో చైల్డ్ ఆర్టిస్టులు కూడా పెద్ద స్టార్ హీరోలు లేదంటే హీరోయిన్లు అయిపోవచ్చు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్ద అయిన తర్వాత బాగా సెటిల్ అయిపోయారు. రచ్చ సినిమాలో చూసుకున్నట్లయితే తమన్నా చిన్నప్పుడు పాత్ర ఒక చైల్డ్ ఆర్టిస్ట్ పోషించింది. తాను రచ్చ సినిమాతో పాపులర్ అయిపోయింది.
హీరోయిన్ గా సగిలేటి కథ అనే సినిమాలో నటించింది ఏందిరా ఈ పంచాయతీ అనే దానిలో కూడా ఈ అమ్మాయి హీరోయిన్ గా చేసింది ఒక ఇంటర్వ్యూలో విశిక లక్ష్మణ్ మాట్లాడుతూ రచ్చ సినిమా కాకుండా ఇంకా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ రచ్చ సినిమా నేను చివరి సారిగా నటించిన సినిమా.
ఆ తర్వాత చదువులతో బిజీ అయిపోయా. రచ్చ సినిమాలో చేస్తున్న టైం లో రామ్ చరణ్ గారిని తమన్న గారిని నేను కలవలేదని. ఈమె షూటింగ్ టైంలో వాళ్లు అక్కడ లేరని అని చెప్పింది ఇప్పుడు వాళ్ళు నన్ను చూసినా కూడా గుర్తుపట్టరు అని అని చెప్పింది. ప్రస్తుతం విషిక లక్ష్మణ్ (vishika lakshman) మాట్లాడిన ఆ మాటలు వైరల్ అవుతున్నాయి.